డిజిటల్ క్యాంపెయిన్ లో సత్యవేడు జనసేన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జిల్లా అధ్యక్షులు డా:పసుపులేటి హరిప్రసాద్ గారి ఆదేశాల మేరకు సత్యవేడు నియోజకవర్గం, సత్యవేడు మరియు KVB పురం మండలాల్లో జిల్లా కార్యదర్శి కొప్పల లావణ్యకుమార్ మండల నాయకుడు థామస్ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ తిరుపతి ఎంపీ శ్రీ గురుమూర్తి పార్లమెంట్ లో పోరాడాలని ప్లకార్డులతో నిరసన తెలియజేసారు. లావణ్యకుమార్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు కోసం కార్మికులు అలుపెరుగని పోరాటం చేస్తుంటే, మన ఎంపీలు పార్లమెంట్ లో కాలక్షేపం చేస్తున్నారని, ప్రైవేటీకరణను మొదట వ్యతిరేకించింది శ్రీ పవన్ కళ్యాణ్ అని తక్షణమే ఎంపీలు కేంద్ర పెద్దలతో మాట్లాడాలని పార్లమెంట్ లో గళం విప్పాలని లేని పక్షంలో ఎంపీలు తగిన మూల్యం చెల్లించుకుంటారని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మునివేలు, నాదముని, అఖిల్, స్టాలిన్ అజిత్, ప్రదీప్, కిషోర్, భూపతి, కిరణ్ మరియు హేమంత్, సాయి, సుధాకర్ పాల్గొన్నారు.