మూగజీవుల్ని రక్షించండి: జనసేన డిమాండ్

  • మూగజీవుల్ని రక్షించండి అనే నినాదంతో మోకాలు మీద నిరసన తెలియజేసి ప్రభుత్వ అధికారులకు వినతి పత్రం అందజేసిన గుడివాడ పట్టణ జనసైనికులు

గుడివాడ నియోజకవర్గం: గుడివాడ పట్టణంలో గోవులను, గోవుల యజమానులు రోడ్డు మీదకి వదిలివేయడంతో గోవులకు మరియు వాహనదారులకు తీవ్ర ఇబ్బంది పడటంతో ఆ సమస్యను ప్రభుత్వాధికారులకు వినతి పత్రం ద్వారా గుడివాడ పట్టణ జనసైనికులు అందజేసారు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ మనదేశంలో గోమాతను ఎంతో పవిత్రంగా పూజిస్తారని, అలాంటి గోమాతలను రోడ్లమీద వదిలేయడం వల్ల చెత్త చెదారం ప్లాస్టిక్ వ్యర్ధపదార్ధాలు తినడం వల్ల గోవుల ఆరోగ్యం క్షీణిస్తుందని, అదేవిధంగా రోడ్లు మీద పడుకోవడం వల్ల వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారని, ఈ విషయాన్ని గుడివాడ పట్టణ మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ద్వారా తెలియజేయడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా గో యజమానులకు కూడా నా యొక్క విన్నపం అని దయచేసి మీ గోవుల్ని రోడ్డు మీదకి రాకుండా చూడాలని కోరారు. అవి రోడ్డు మీదకి రావడం వల్ల ఆటోలు, బస్సులు గుద్దుకోవడం వల్ల తీవ్ర రక్తస్రావంతో నోరులేని మూగజీవాలు ఇబ్బందు పడుతున్నాయని మళ్లీ అలాంటివి జరగకుండా చూడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుడివాడ పట్టణ ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మీరా షరీఫ్, నూనె అయ్యప్ప, చరణ్ తేజ్, కిరణ్, మహమ్మద్ హుస్సేన్, శివ, చరణ్, మరియు జనసైనికులు పాల్గొన్నారు.