రెండో రోజు బండి సంజయ్ పాదయాత్ర..
టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. బీజేపీ పార్టీని మరింత బలోపేతం చేయాలనే దృఢ సంకల్పంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర నిన్న చార్మినార్ దగ్గర ప్రారంభం అయింది. చార్మినార్ దగ్గర ప్రారంభమైన ఈ పాదయాత్ర.. అసెంబ్లీ మీదుగా. నిన్న రాత్రి సమయానికి మెహిదీపట్నం కు చేరుకుంది.
నిన్న రాత్రి అక్కడే బస చేసిన బండి సంజయ్. ఇవాళ రెండో రోజు ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభించనున్నారు. మెహిదీ పట్నం, తొలిచౌకి, షేక్ పేట, గోల్కొండ పోర్ట్, లంగర్ హౌస్, బాపు ఘాట్ మీదుగా రెండో రోజు పాదయాత్ర కొనసాగనుంది. ఈ రోజు ఏకంగా 11 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు బండి సంజయ్. ఇక గోల్కొండ పోర్ట్ దగ్గర సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభ నిర్వహించనుంది బీజేపీ. ఈ బహిరంగ సభలో బండి సంజయ్ ప్రసంగించనున్నారు. ఇక ఇవాళ రాత్రి శ్యాం ప్రసాద్ ముఖర్జీ ప్రాంగణం బాపు ఘాట్ దగ్గర బండి సంజయ్ బస చేయనున్నారు.