అవనిగడ్డ నియోజకవర్గం నివేదికను అందించిన రాష్ట్ర కార్యదర్శులు

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని జనసేన నాయకులు, క్రియాశీలక సభ్యులు, జన సైనికులు, వీరమహిళలతో పార్టీ కేంద్ర కార్యాలయం ప్రతినిధులు వారం రోజులపాటు సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శులు శ్రీమతి పొలాసపల్లి సరోజ (కాకినాడ మాజీ మేయర్), శ్రీ తాతంశెట్టి నాగేంద్ర అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటించారు. వీరు నిర్వహించిన సమావేశాల వివరాలతో కూడిన నివేదికను ఆదివారం ఉదయం జనసేన పి.ఏ.సి. ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ కి కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శులు శ్రీమతి పొలాసపల్లి సరోజ, శ్రీ తాతంశెట్టి నాగేంధ్ర అందచేశారు. అవనిగడ్డ, చల్లపల్లి, నాగాయలంక, ఘంటసాల, మోపిదేవి, కోడూరు మండలాల్లో సమావేశాలు నిర్వహించారు. క్షేత్ర స్థాయి నుంచి పార్టీ బలోపేతం దిశగా చేపట్టే కార్యక్రమాల నిర్వహణ, మండల కమిటీ అధ్యక్షుల ఎంపిక అంశాలపై మండలాలవారీగా చర్చించి నాయకులు, శ్రేణుల సూచనలను, అభిప్రాయాలను స్వీకరించారు. ఈ బృందం ఇచ్చిన నివేదికను పరిశీలించి శ్రీ నాదెండ్ల మనోహర్ అభినందించారు.