పవన్ కళ్యాణ్ కు భద్రత పెంచాలి: రాజంపేట జనసేన
రాజంపేట, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు భద్రత పెంచాలని రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు స్వేచ్ఛ లేదని రాజంపేట జనసేన పార్టీ నాయకులు పేర్కొన్నారు. గురువారం రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు రాజంపేట జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కుట్రలు జరిగే అవకాశం ఉందని భద్రత పెంచాలని ఆంధ్రప్రదేశ్ ఆశాజ్యోతి కొణిదల పవన్ కళ్యాణ్ ను కాపాడే బాధ్యత మన అందరి పైన ఉందని తక్షణమే కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచాలన్నారు. పవన్ కళ్యాణ్ పై దాడి చేయడం వైసీపీ నాయకుల గుండాలు పవన్ కళ్యాణ్ ఇంటిదగ్గర ఉండే బౌన్సర్లను తిట్టి అసభ్య పదజాలతో మాట్లాడడం సరికాదని జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నామన్నారు. పవన్ కళ్యాణ్ కు ఏమాత్రం కొంచెం అపాయం జరిగినా జనసైనికుల దెబ్బకు తట్టుకోలేరుని రాజంపేట జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలోజనసేన రాష్ట్ర చేనేత కార్యదర్శిరాటాల రామయ్య, జనసేన పార్టీ కడప జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు కత్తి సుబ్బరాయుడు, భాస్కర్ పంతులు, తాళ్లపాక శంకరయ్య, వెంకటయ్య గోపి, వీరయ్య ఆచారి, జనసేన పార్టీ వీర మహిళ శిరీష, చెంగల్ రాయుడు, పోలిశెట్టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-03-at-19.31.50-1024x576.jpeg)