జనసేన అధినేతకు భద్రత కల్పించాలి

పాలకొండ, ప్రస్తుతం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై జరుగుతున్న కుట్రలను ఖండిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు, కూరంగి నాగేశ్వరరావు (ఎస్.బి.ఐ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్) ఆధ్వర్యంలో పాలకొండ పట్టణంలోని యాలం జంక్షన్ అంబేద్కర్ కూడలి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా గర్భన సత్తిబాబు మాట్లాడుతూ మా పార్టీ అధినేతపై జరుగుతున్న రెక్కి తమను తీవ్రంగా ఆందోళనకు గురి చేసేయని వాపోయారు అలాగే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని పవన్ కళ్యాణ్ కి జడ్ ప్లుస్ కేటగిరి భద్రత కల్పించాలని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ పై ఎవరైనా హాని తలపెట్టినట్టైనా జనసైనికులు, నాయకులు సహించేది లేదన్నారు. పవన్ కళ్యాణ్ ని కాపాడుకునేందుకు అభిమానులు ఎంతటికైనా తెదిగించడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మిడతాన ప్రసాద్, వండాన సాయి, సతివాడ వెంకట రమణ, గర్భాపు నరేంద్ర, జల్లు సోముబాబు, డొంపకా సాయి, మాదాసి సంతోష్, అజాద్ తదితరులు పాల్గొన్నారు.