జనసేన పార్టీలో చేరిన సీనియర్ మైనార్టీ నాయకులు

మంగళగిరి: జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఎంటిఎంసీ ముస్లిం మైనార్టీ సెల్ కోఆర్డినేటర్ షేక్ సుభాని ద్వారా జనసేన పార్టీ ఎంటిఎంసీ నగర అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతి రావు సమక్షంలో మంగళగిరి పట్టణం, 29వ వార్డు తెలుగు దేశం పార్టీ క్రియాశీలక సభ్యుడు షేక్ అజీమ్(ఆటో మెకానిక్), 29వ వార్డుకు చెందిన వానపల్లి రాంబాబుకు పార్టీ కండువా కప్పి, సాదరంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం వెంకట సాంబ శివరావు(జె ఎస్ ఆర్), ఎంటిఎంసీ మైనార్టీ సెల్ కో ఆర్డినేటర్ షేక్ సుభాని, మంగళగిరి నియోజకవర్గ యూత్ నాయకులు చిట్టెం అవినాష్, మంగళగిరి పట్టణ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జొన్నాదుల పవన్ కుమార్, మంగళగిరి మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ లేళ్ళ సాయి నందన్, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.