శేరిలింగంపల్లి నియోజక వర్గ జనసేన పార్టీ ఇంఛార్జి గా డాక్టర్ మాధవరెడ్డి

శేరిలింగంపల్లి: జూన్ 12 వ తారీఖు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ జనసేన పార్టీ ఇంఛార్జి నియామకాలు జరిగాయి. అందులో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జిగా డాక్టర్ మాధవరెడ్డి ని నియమించటం జరిగింది. ఈ సందర్భంగా మాధవ రెడ్డి ప్రసంగిస్తూ
నాకు ఈ బాధ్యత అప్పగిఒచినఒదుకు జనసేన పార్టీ సిద్ధాంతానికి అంకిత భావంతో నీతి, నిజాయితీ, నిబద్దత, క్రమశిక్షణ, చిత్త శుద్ధితో పని చేస్తానని అలాగే ప్రజా సమస్యల పట్ల అలుపెరగని పోరాటం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ అన్ని కార్యాక్రమాలలో చురుగ్గా పాల్గొని ప్రజలు ఎదురుకొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తానని, జనసేన పార్టీలో నమ్మిన సిద్ధాంతానికి అహర్నిశలు కృషి చేసి పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాకు అప్పగించిన ఈ పదవి మరింత బాధ్యత పెంచిందని తెలియ చేస్తూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీ కచ్చితంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం లో జనసేన సత్తా చాటుతుందని తెలిపారు. ఈ బాధ్యత అప్పగించిన జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాన్ కి పార్టీ ఉపాధ్యక్షలు బొంగూరి మహేందర్ రెడ్డి కి, తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి నేమూరి శంకర్ గౌడ్ కి, పి ఏ సీ మెంబర్ అర్హం ఖాన్ కి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధరం రాజలింగం కి మరియు ఎల్లవేళలా నా వెన్నంటే నిలిచే నా శేరిలింగంపల్లి జనసేన పార్టీ నాయకులు, జనసైనికుల కు మనసారా కృతజ్ఞతలు తెలియచేసారు.