గల్ఫ్ సేన జనసేన యూఏఈ ఎగ్జిక్యూటివ్ టీం ఆధ్వర్యంలో దుబాయ్ లో సేవా కార్యక్రమాలు

దుబాయ్, జబల్ అలీ ప్రాంతంలో తెలుగు రాష్ట్రాలకి చెందిన కార్మికులతో గల్ఫ్ జనసేన యూఏఈ కార్మికులతో 3వ విడత కార్యక్రమం జబల్ అలీ వర్కర్ల క్యాంపులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు. కార్మికులకు శ్రీనివాస్ చేతుల మీదుగా ఫ్రూట్స్ మరియు జ్యూసులు అందజేశారు. అలాగే కార్మికులకు దుబాయ్ లో ఉండే చట్టాలు గురించి వివరించడం జరిగింది. కొంతమంది కార్మికులు తమ బాధలు చెప్పుకోవడం జరిగింది. ఉద్యోగం కోల్పోయిన వారికి భరోసా ఇచ్చి భారత కాన్సులేట్ సహాయంతో త్వరలోనే భారత్ పంపిస్తామని గల్ఫ్ జనసేన ఇంచార్జ్ త్రిమూర్తులు, జాతీయ కన్వీనర్ చంద్రశేఖర్ భరోసా ఇచ్చారు. ఇంత మంచి కార్యక్రమాన్ని కార్మికులతో ఏర్పాటు చేసిన యూఏఈ ఎగ్జిక్యూటివ్ టీం ప్రాంతీయ కన్వీనర్లని బొలిశెట్టి శ్రీనివాస్ అభినందించారు.