ఘనంగా షాజహాన్ బాషా జన్మదిన వేడుకలు

మదనపల్లి: జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలతో కలసి గంగారపు రామదాస్ చౌదరి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా జన్మదినం సందర్భంగా బాషాను శాలువాతో సన్మానించి, బొకే అందచేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామదాస్ చౌదరి మాట్లాడుతూ ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి, అల్లా, జీసస్ లు షాజహాన్ బాషా గారికి నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యాలను ఇవ్వాలని, పవన్ కళ్యాణ్ గారు పిలుపు నిచ్చిన విధంగా వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్, వైసీపీ విముక్త మదనపల్లి, రాజంపేట దిశగా పనిచేస్తామని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు నిర్ణయించిన జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి విజయానికి అందరం కలసికట్టుగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, జిల్లా జాయింట్ సెక్రటరీలు సనా ఉల్లా, గజ్జల రెడ్డెప్ప, రూరల్ మండలం అధ్యక్షులు గ్రానైట్ బాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి రెడ్డెమ్మ, సెక్రటరీ నాగవేణి, సరోజ, స్వాతి, లవన్న, రూరల్ మండల ఉపాధ్యక్షులు కుమార్, రామసముద్రం మండల ఉపాధ్యక్షులు గడ్డం లక్ష్మిపతి, రూరల్ మండలం ఉపాధ్యక్షులు చంద్రశేఖర, రాజారెడ్డి, విజయ్ కుమార్, గంగులప్ప, సెక్రటరీ జనార్దన్, నిమ్మనపల్లి ఉపాధ్యక్షులు అఫ్రోజ్, జాఫర్, జెస్వంత్ తదితరులు పాల్గొన్నారు.