శర్వానంద్ ‘మహా సముద్రం’ అఫీషియల్ అనౌన్స్ మెంట్‌

ఆర్‌.ఎక్స్ 100తో హిట్ సాదించిన అజయ్ భూపతి ఆ సినీమా హిట్ తరవాత కూడా మరో సినిమా మొదలు పెట్టడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఒక స్టొరీ తో రవితేజతో కొంతకాలం ట్రావెల్ చేశాడు. కానీ.. ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. ఆ తరవాత శర్వానంద్ కు స్టొరీ  చెప్పగానే శర్వా ఓకె చేసాడు. ఆ స్టొరీనే `మహా సముద్రం`. ఏకే ఎంటర్టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ వచ్చేసింది. శర్వా – అజయ్ భూపతి కాంబినేషన్ లో `మహా సముద్రం` నిర్మించనున్నట్టు ఏకే సంస్థ ప్రకటించింది. శర్వానంద్ ఈ సినీమాలో ఛాలెంజింగ్ రోల్‌లో కనపించనున్నాడు అని టీం చెబుతుంది.

తెలుగు, తమిళ భాషలలో విడుదల కానున్న మహా సముద్రం చిత్రం లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందనుందట. ఈ సినిమా కోసం అజయ్ పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్దం చేశారట. ఈ సినిమాకు సంబంధించి ప్రతివారం ఏదో ఒక అప్డేట్ ఉంటూనే ఉంటుందని మేకర్స్ అంటున్నారు. వైజాగ్ నేపథ్యంలో వినూత్న కథతో సాగే ఈ చిత్రం ఆర్ ఎక్స్ 100 తరహాలోనే ఉంటుందంటున్నాడు దర్శకుడు. సిద్దార్ద్ మరో రోల్‌లో కనిపించనున్నట్టు సమాచారం.