జనసేనానిని మర్యాదపూర్వకంగా కలిసిన శివదత్ బోడపాటి
మంగళవారం జరిగిన జనసేన సమీక్షా సమావేశంలో విజయవాడ మంగళగిరి పార్టీ కార్యాలయం నందు అధినేత పవన్ కళ్యాణ్ గారిని పాయకరావుపేట నియోజకవర్గ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి మర్యాదపూర్వకంగా కలిసి ఫోటో బహుకరించారు.
అనంతరం శివదత్ మాట్లాడుతూ.. ఈ ఫోటో మన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినప్పుడు ఆయన తీసుకున్న తరువాత పట్టుకోవటానికి బరువు వున్నప్పటికీ ప్రక్కకు పెట్టకుండా ఇది క్రిందికి పెట్టవద్దు, నాకు కనిపించేలాగా పైన పెట్టండి అని సిబ్బందికి సూచించారు, ఆయన గప్ప వ్యక్తిత్వానికి పాదాభివందనాలు చేసుకోవడం నా అదృష్టం. ఇలాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన నాయకులు చాలా అరుదుగా ఉంటారు. బడుగు బలహీనవర్గాలకు నిజమైన ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ మాత్రమే, ఈ సారి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసి తీరుతాం అన్నా అని ఆనందం వ్యక్తం చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-06-at-5.07.07-PM-1024x746.jpeg)