విశాఖ చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్

• విమానాశ్రయంలో ఘనస్వాగతం
• సాయంత్రం జగదాంబ సెంటర్ లో వారాహి విజయ యాత్ర సభ

మూడో విడత వారాహి విజయ యాత్ర నిమిత్తం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు విశాఖ చేరుకున్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. వీర మహిళలు వారాహి యాత్ర దిగ్విజయంగా సాగాలని ఆకాంక్షిస్తూ హారతులు పట్టారు. పార్టీ పీఏసీ సభ్యులు కోన తాతారావు, ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్, మాజీ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, అధికార ప్రతినిధులు సుందరపు విజయ్ కుమార్, పరుచూరి భాస్కరరావు, పార్టీ నాయకులు పీ వీ ఎస్ ఎన్ రాజు, డాక్టర్ పంచకర్ల సందీప్, శ్రీమతి పసుపులేటి ఉషాకిరణ్, డాక్టర్ బొడ్డేపల్లి రఘు, డాక్టర్ మూగి శ్రీనివాస్, పీలా రామకృష్ణ, రమణారెడ్డి, శ్రీమతి అంగా ప్రశాంతి, శ్రీ దల్లి గోవిందరెడ్డి, శ్రీమతి వసంత లక్ష్మి, శ్రీ కందుల నాగరాజు, శ్రీమతి త్రివేణి, శ్రీమతి శారణిదేవి, శ్రీమతి నాగలక్ష్మి తదితరులు పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విశాఖ చేరుకున్నారు. వారాహి విజయ యాత్రలో భాగంగా సాయంత్రం జగదాంబ సెంటర్ లో జరగనున్న బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు.