జనసేన ఆధ్వర్యంలో శ్రీమంతాల వేడుక

కాకినాడ రూరల్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా కరప మండలం కూరాడ గ్రామంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో జనసైనికులు ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీమంతాల కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ మరియు వారి సతీమణి శ్రీమతి పంతం అరుణ. అరుణ చేతుల మీదుగా మహిళలకు చీరలు, పువ్వులు, గాజులు, స్వీట్స్, డ్రైఫ్రూట్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.