కనపర్తి మనోజ్ కుమార్ ను అభినందించిన ఎస్ ఐ రమేష్ బాబు

  • మనోజ్ కుమార్ లాంటి నిజాయితీపరులు సమాజానికి ఎంతో అవసరం\

పొన్నలూరు: శుక్రవారం పొన్నలూరు చెరువు దగ్గర 25000 రూపాయల విలువ చేసే వెంకట్రావు అనే వ్యక్తి మొబైల్ పోగొట్టుకోవడం జరిగింది. ఆ మొబైల్ మనోజ్ కుమార్ కి దొరకడం జరిగింది, మనోజ్ కుమార్ వెంటనే ఆ మొబైల్ ని తీసుకుని వచ్చి పోన్నలూరు ఎస్.ఐ “రమేష్ బాబు” కి ఇవ్వడం జరిగింది. ఎస్ఐ వెంటనే స్పందించి.. మొబైల్ పోగొట్టుకున్న వెంకటరావు ని పోలీస్ స్టేషన్ కి పిలిపించి మొబైల్ ఇవ్వడం జరిగింది. మనోజ్ కుమార్ లాంటి నిజాయితీపరులు ఈ సమాజానికి ఎంతో అవసరం అని ఎస్ఐ
అభినందించారు.