8 ఏళ్ళ తరువాత తెలుగు సినిమా చేస్తున్న సిద్ధార్థ్

బాయ్స్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు సిద్దార్థ్. తమిళంతో పాటు హిందీ సినిమాలు చేయడంలో బిజిగా మారిన సిద్దూ  చాలా కాలం నుంచి డైరక్ట్ తెలుగు సినిమా చేయలేదు. ఈ లోటును పూర్తి చేయడానికి సిద్ధూ పూర్తిగా సిద్ధం అయ్యాడు. తను చాలా కాలం తరువాత తెలుగు సినిమాలో  కనిపంచనున్నట్టు ట్విట్టర్ లో ప్రకటించాడు ఈ హ్యాండ్సమ్ హీరో.

ఒక ఓటీటీ  వేదికలో నవరస అనే సినిమా చేయడానికి అంగీకరించిన సిద్ధూ ఇక తన సినిమాల స్పీడును పెంచడానికి నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే తెలుగు సినిమా చేయడానికి కూడా అంగీకరించాడు. ‘Rx 100’ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహించనున్న ”మహా సముద్రం” అనే మల్టీస్టారర్ బొమ్మరిల్లు సిద్ధార్థ్ నటిస్తున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో మరో హీరోగా వర్సటైల్ యాక్టర్ శర్వానంద్ నటించనున్నాడు.

సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో అంతగా యాక్టివ్ లేని సిద్దార్థ్ ఎనిమిది సంవత్సరాల తరువాత మరో తెలుగు సినిమా చేస్తున్నాను. మహాసముద్రంతో మీ ముందుకు రానున్నాను. నేను ఎప్పటికైనా తిరిగి వస్తాను అన్నాను.. అలాగే తిరిగి వస్తున్నాను. మంచి టీమ్ , మంచి కోస్టార్స్ తో ఈ సినిమా చేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. మీ ఆశీర్వాదాలు కావాలి అని ట్వీట్ చేశాడు.