బడి ద్వారం ముందే గోతులు
మదనపల్లి నియోజకవర్గం, రామసముద్రం మండలము, చొక్కాండ్ల పల్లె పాఠశాల ముఖద్వారం ముందే వీధిపై గోతులు పడ్డాయి. వర్షం పడితే పైభాగంలో ప్రవహించే నీరు ముఖద్వారం ముందు ఉన్న లోతుల్లో నీరు నిల్వ వుండి పోతుంది. విద్యార్థులు నీటిలో నడిచి పాఠశాల ప్రాంగణంలో కి ప్రవేశించాల్సి వుంటుంది. ఏ మాత్రం అజాగ్రత్త పడినా విధ్యార్థులు నీటిలో పడిపోయే పరిస్థితి వుంటుంది. కావున అధికారులు వెంటనే స్పందించి పాఠశాల ముందు వున్న గోతులను పూడ్చి అక్కడ చేరుకున్న నీటిని తొలగించాలని జనసేన పార్టీ తరఫున చిత్తూరు జిల్లా జనసేన ప్రధాన కార్యాదర్శి దారం అనిత డిమాండ్ చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-25-at-6.33.54-PM.jpeg)