మూడవ రోజు డిజిటల్ క్యాంపెయిన్ లో సింగనమల జనసేన
&అడుగుకోగుంత గజానికో గొయ్యి
అనంతపురం జిల్లా: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టి సి వరుణ్ ఆదేశాల మేరకు #Goodmorningcmsir డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా, సింగనమల నియోజకవర్గం, సింగనమల మండలం, లోలూరు క్రాస్ నుండి మదిరే పల్లెకు వెళ్ళు రోడ్డు అడుగు కో గుంత.. గజానికి గోయ్యి మాదిరిగా ఉంది. గతుకుల్లో గుంతల్లో రోడ్డును వెతుక్కోవాల్సి వస్తోంది. కావున ఈ రోడ్డు వెంటనే మరమ్మత్తులు చేపట్టవలసిందిగా జనసేన పార్టీ తరఫున హెచ్చరించి.. లేనిపక్షంలో సింగనమల నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శులు బొమ్మన పురుషోత్తమ రెడ్డి, దేవరకొండ జయమ్మ, నాయకులు బందెల సాయి శంకర్, ప్రవీణ్, సాయి చంద్ర, ప్రతాపు బాలాజీ ఓబులేసు నీకు పెడతాను కుళ్ళాయి, రమేష్, రామంజి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-17-at-11.45.25-AM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-17-at-11.45.27-AM.jpeg)