కరోనా బాధితులకోసం సింగర్ స్మిత

కరోనా కష్టకాలంలో నేనున్నా అంటూ ముందుకు వచ్చారు గాయని స్మిత. ఏపీ ఎంటర్ పెన్యూర్ ఆర్గనైజేషన్, ఈషాకు చెందిన అలై ఫౌండేషన్ సహకారంతో ‘స్మిత కేర్’ పేరిట సేవాకార్యక్రమాలను చేపట్టారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఆరు ప్రాంతాలలో కోవిడ్ బాధితుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్టు ఆమె తెలిపారు. విజయవాడ, వెస్ట్ గోదావరి, అనంతపూర్, శ్రీకాకుళం, హైదరాబాద్, విశాఖపట్నంలో హెల్ప్ లైన్స్‌ను ఏర్పాటు చేసి బాధితులకు సహాయాన్ని అందిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌, మెడికోవర్ సంయుక్త ఆధ్వర్యంలో 50 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దీంతో పాటు ఆక్సిజన్ సౌకర్యం ఉన్న ఆరు వందల బెడ్స్‌ను ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉంచామన్నారు. అలానే కరోనా బాధితులు అధైర్య పడకుండా వారికి టెలిఫోన్‌లోనూ వైద్య సహకారం, సలహాలూ సూచనలు అందించే విధంగా ఓ డాక్టర్ల బృందాన్ని నియమించామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

స్మిత కేర్ సేవలను పొందడానికి సంప్రదించాల్సిన నంబర్లు:

హైదరాబాద్ – 99514 02666

విజయవాడ & ఏలూరు – 99850 70997, 90146 77932

అనంతపురం & శ్రీకాకుళం – 90326 40666

వైద్యులతో ఉచిత సంప్రదింపుల కోసం – 97035 89022