జనసేన నినాదాలతో దద్దరిల్లిన సీతానగరం మండల కేంద్రం

సీతానగరం, మండలంలో గల లక్ష్మిపురం గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు, సీతానగరం మండల నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు. ముందుగా మండల కేంద్రంలో ఉన్న శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం భారీగా బైక్ ర్యాలీతో లక్ష్మిపురం చేరుకొని బాబు పాలూరు మరియు గ్రామస్తులు కలిసి జెండా ఆవిష్కరణ చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మిపురం యువత మరియు గ్రామ మహిళలు, వృద్ధులు అలాగే మండల నాయకులు పాల్గొని మరింత ఉత్సహాన్ని అందించారు. అనంతరం బాబు పాలూరు మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రజల పార్టీ మన అధినేత పవన్ కళ్యాణ్ మన అందరి భవిష్యత్తు కోసం ఆయన భవిష్యత్తుని వదులుకొని సమాజంలో మార్పు రావాలి అని ఇప్పుడు ఉన్న ఈ కుళ్ళు రాజకీయంని ప్రక్షాళన చెయ్యాలని ఆశయంతో జనసేన అనే పార్టీ పెట్టారు. లక్ష్మిపురం గ్రామంలో జెండా ఎగరేశాం, అలాగే ప్రస్తుతం మన జగన్ రెడ్డి చేస్తున్న పరిపాలన ఎలా ఉంది అంటే అమ్మకి అన్నం పెట్టనోడు పిన్నమ్మకి బంగారు గాజులు చేయించాడు అనే విధానంగా ఉంది. ఈ రాజకీయ వ్యవస్థను మార్చడానికే మన గ్రామంలో ఉన్న మీ అందరి బిడ్డలు పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుద్దామని నిశ్చయం చేసుకున్నారు, దానికి మీరు అంతా మీ బిడ్డ మాటలు విని ముందుకు వచ్చి జనసేన పార్టీని అధికారంలో నిలబెట్టండని, ఈ కార్యక్రమంకి కంకణం కట్టుకున్న లక్ష్మిపురం గ్రామ జనసైనికులు అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భారీగా మండలంలో గల జనసైనికులు పాల్గొనటం జరిగింది.