“మన సీతానగరం-మన జనసేన” ప్రారంభించిన సీతానగరం జనసేన

పార్వతీపురం, జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా సీతానగరం జనసేన టీం ఆధ్వర్యంలో “మన సీతానగరం-మన జనసేన ” కార్యక్రమాన్ని ఆదివారం నాడు పార్వతీపురం నియోజకవర్గం, సీతానగరం మండలం పెదభోగిల గ్రామంలో నిర్వహించి ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాల్ని తెలియచేస్తూ జనసేన సిద్ధాంతాల్ని, ఆశయాల్ని వివరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్వతీపురం నియోజకవర్గ జనసేన నాయకులు అల్లు రమేష్, ఖాతా విశ్వేశ్వరరావు, చిట్లు గణేష్, రాజాన బాలు మరియు సీతానగరం నాయకులు సంతోష్, జై శంకర్ , జై ప్రకాష్, జగదీష్, నాయుడు, శ్రావణ్, భాస్కర్, ప్రకాష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తరువాత సీతానగరం మండల నాయకులు అల్లు రమేష్ మాట్లడుతూ ప్రజల్లో జనసేన పార్టీ మీద సానుకూల స్పందన ఉందని,ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకున్నామని మరియు కొంతమంది స్వతహాగా వారి సమస్యల్ని పార్టీ కార్యాలయ దృష్టికి తీసుకువచ్చారని, ఈ గ్రామ సమస్యల్ని తొందర్లో ఎలా పరిష్కరించాలో మా ప్రణాళిక రూపకర్తలు అయిన పార్వతీపురం నియోజకవర్గ నాయకులు పైల సత్యనారాయణ, రెడ్డి మణికంఠలతో చర్చించి పరిస్కారం అందిస్తామని హామీ ఇవ్వటం జరిగింది. ఇదే మాదిరిగా ఈ కార్యక్రమం నియోజకవర్గం మొత్తం చేసి పార్టీని బలోపేతం చేసే విధంగా కార్యక్రమం ఉంటుంది అని తెలియచేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన పెదబోగీల గ్రామ జనసైనికులకు, ప్రజలకి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.