రక్తదానం చేసిన జనసైనికులు
విజయనగరం జిల్లా, రాజాం నియోజకవర్గం, వంగర మండలం కొప్పరవలస గ్రామంకి చెందినటువంటి ముంతల అప్పలరాంకి, హార్ట్ ప్రాబ్లెమ్ అవ్వడం వల్లన వీరఘట్టం మండలం జనసేన నాయుకులు జనసేన జానీకి వాళ్ళు తెలియపర్చడం జరిగింది. జనసేన జానీ తక్షణమే స్పందించి తెట్టింగి గ్రామ జనసైనికులు కొట్టిశ లక్ష్మణ్, రాజాం నియోజకవర్గం రేగిడి ఆమదాలవలస గ్రామ జనసైనికులు కుక్కరా రామ్ లకు తెలుపగా వారు వెళ్ళి రక్తదానం చెయ్యడం జరిగింది. వీరిని దగ్గర ఉండి వీరఘట్టం మండలం కిమ్మి గ్రామ జనసేన వీరమహిళ అయినటువంటి రౌతు శివకుమారి దగ్గర ఉండి, అన్ని టెస్ట్ లు చేయించారు. ఆమె మాట్లాడుతూ జనసేన జనసేన అదినాయుకులు కొణిదల పవన్ కళ్యాణ్ పార్టీలో మేము ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం అని అన్నారు. ఒక నిజాయితీగల నాయుకులు జనసేనానికి జనసైనికులుగా నేను ఒక జనసేన వీరామహిళగా జనసేన పార్టీలో పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పడం జరిగింది. అలాగే పేషెంట్ తాలూకా ఫ్యామిలీ వారు మాట్లాడుతూ మాకు బ్లడ్ డోనార్స్ ఇద్దరు కావాలి అంటే జనసేన జానీ వెంటనే స్పందించి పంపించినందుకు వారికి మరియు జనసేన పార్టీకి ఎప్పటికి రుణపడి ఉంటామని చెప్పడం జరిగింది. జనసేన జానీ మాట్లాడుతూ రక్త దానం చేసిన లక్ష్మణ్, శివలకు ఆలాగే ఒక రోజు అంతా దగ్గర ఉన్నటువంటి రౌతు శివకుమారికి ధన్యవాదములు చెప్పడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-16-at-19.37.26-472x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-16-at-19.37.05-1024x472.jpeg)