జనసేన పార్టీ ఆధ్వర్యంలో “శిల్ప” కు ఘన సన్మానం

జనసేనపార్టీ ఆవిర్భావం నుండి క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న గుమ్మడిసాని శిల్పను జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ మేరకు మంగళగిరిలోని జనసేనపార్టీ కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమానికి జనసేన పార్టీ వీరమహిళా విభాగం రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యులు పెండ్యాల శ్రీలత ఆధ్వర్యంలో జిల్లా నుండి పలువురు మహిళలు వెళ్లడం జరిగింది. పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటూ.. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం చేస్తూ.. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీ దౌర్జన్యాలకు ఎదురొడ్డి.. నార్పల ఎంపీటీసీ-1 ప్రదేశిక ప్రాంతం నుండి జనసేన పార్టీ తరుపున బరిలో నిల్చున్న గుమ్మడిసాని శిల్ప ను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా గుమ్మడిసాని శిల్ప మాట్లాడుతూ.. అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పార్టీలో మహిళలకు పెద్ద పీట వేస్తూ మహిళల కోసం పార్టీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి దానికి వీరమహిళా అని నామకారణం చేసి మరింత గౌరవం పెంచారని. తన సేవలను గుర్తించి మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయంలో సన్మానించడం ఆనందంగా ఉందన్నారు. జనసేనపార్టీ అభివృద్ధి కోసం మరింత రెట్టింపు ఉత్సాహంతో పని చేసి, 2024 ఎన్నికల్లో జనసేనపార్టీ అధికారమే లక్ష్యంగా తన వంతు కృషి చేస్తానన్నారు.