జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా వ్యవహరించిన జనసైనికులకు ఘన సన్మానం

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం, ప్రత్తిపాడులో లయన్స్ క్లబ్ ఫంక్షన్ హాల్లో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా వ్యవహరించిన జనసేన వాలంటీర్లకు నియోజకవర్గ జనసేన నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్(బాబి) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సన్మాన కార్యక్రమానికి రౌతులపూడి, శంఖవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సన్మాన కార్యక్రమం అనంతరం సూర్య కిరణ్(బాబీ) మాట్లాడుతూ జనసేన పార్టీకి నిస్వార్ధపరులైన జనసైనికులే బలమని, ప్రతి గ్రామంలో జనసైనికులు ప్రజా సమస్యలపై పోరాడి పరిష్కార దిశగా కృషి చేయాలన్నారు. పార్టీ విధి విధానాలపై జనసైనికులతో చర్చించి రాబోయే ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గంతో పాటు ఆంధ్రప్రదేశ్లో జనసేన జెండా ఎగురవేసి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేసేవరకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు కేవలం 5 రోజుల్లో కొంతమంది జనసైనికుల సహాయంతో 1500కి పైగా సభ్యత్వాలు నమోదు చేయించడం జనసైనికుడిగా గర్వంగా ఉందని సూర్యకిరణ్ (బాబీ) తెలిపారు.