అసెంబ్లీలో మహాత్ముడికి ఘన నివాళులు

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. మహ్మాతుడి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించిన వారిలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హోంమంత్రి మహముద్ అలీ, ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, బోడకుంటి వెంకటేశ్వర్లు, నేతి విద్యాసాగర్‌, కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఉన్నారు. ఈ సందర్భంగా గాంధీ సేవలను స్మరించుకున్నారు.