డ్రైనేజ్ మరియు మంచి నీటి సమస్యలను పరిష్కరించండి

రాయవరం మండలం, చెల్లూరు గ్రామంలో డ్రైనేజ్ మరియు మంచి నీటి సమస్యలను, ప్రజలు పడుతున్న ఇబ్బందులు గురించి ఎం.పీ.టీ.సీ-1 శ్రీమతి గొల్లపల్లి అనురాధ ఏ.డబ్ల్యు.జే.ఈ శ్రీమతి చైతన్య కుమారి దృష్టికి తీసుకెళ్ళి వివరించడం జరిగింది.. ఈ సమస్యల పై సానుకూలంగా స్పందించిన చైతన్య కుమారి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది.