ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యుత్ సమస్య పరిష్కరించండి: రాహుల్ సాగర్

ఎమ్మిగనూరు నియోజకవర్గం ప్రభుత్వ ఆసుపత్రి నందు నెలకొన్న విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించాలని జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాహుల్ సాగర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స కొరకు రోజుకు కొన్ని వందల మంది వస్తూ ఉంటారని.. అందులో మరీ ముఖ్యంగా గర్భిణి స్త్రీలు, జ్వరం వచ్చిన వాళ్లు, ప్రమాదానికి గురైన వాళ్లు ఎక్కువ శాతం ఆసుపత్రిలో అడ్మిట్ అవుతూ ఉంటారు.. విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. అధికారులు ఈ సమస్యను గుర్తించి పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో జనసేన పార్టీ తరఫున తీవ్రమైన ఆందోళన చేపడతామని హెచ్చరించారు.