ముందు సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న సమస్యలని పరిష్కరించండి: బొబ్బేపల్లి సురేష్

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు బుధవారం ముత్తుకూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు మాట్లాడేది నీతులా..? మా అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడితే బూతులా..? ఇది ఎక్కడి దౌర్భాగ్యం. రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి మా అధినేత పవన్ కళ్యాణ్ ని రాజకీయం తెలియదని. ఆయన సినిమాలకే పరిమితం అని రాజ్యాంగం గురించి పూర్తిగా అవగాహన లేదని, ఇంకా ఎన్నో విషయాలని ప్రస్తావించారు. వాటన్నిటికీ కూడా మా దగ్గర పూర్తిగా సమాధానం ఉంది. రాష్ట్రంలో సీబీఐ దత్తపుత్రుడు ఎవరు అని అంటే ఎవరైనా స్పష్టంగా చెప్తారు. అదే విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి చేయకపోగా మళ్లీ మీరు రాజ్యాంగం గురించి, రాజకీయం గురించి, మా అధినేతను గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. దయచేసి ముందు సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న సమస్యలని పరిష్కరించండి. ఇంతకంటే స్పష్టంగా మేమైతే ఏం చెప్పలేం. మీకు అయితే బాగా అర్థమై ఉంటుంటుందని కోరుకుంటూ కార్యక్రమంలో రహీం, శేషారెడ్డి, శ్రీహరి, దిలీపు నవీన్ తదితరులు పాల్గొన్నారు.