దమ్ము, ధైర్యం ఉంటే సుగాలి ప్రీతి కేసుని పరిష్కరించండి: కుంటిమద్ది జయరాం రెడ్డి
అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి మాట్లాడుతూ
వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక కుట్ర ఉందని, నన్ను కూడా చంపడానికి కుట్ర చేస్తున్నారు అని సాక్షాత్తు షర్మిల గారు మీడియా ముందు చెప్పడం వాస్తవం కాదా? వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైయస్ షర్మిల మధ్యన ఆస్తితగాధాలు లేవా?
పదవీ భ్రష్టులైన పేర్నినేని నాని లాంటి వారి మాటలు వారి భార్య పిల్లలే నమ్మరు? ఇంకా ప్రజలేం నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి గారు? కొంచెం కొత్తగా ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు?
నాని పవన్ కళ్యాణ్ గారి నమ్మి జనసేన శ్రేణులు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోవు…. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి మాత్రం షర్మిల గారు, వారి అమ్మగారు, సబ్ జైల్లో చనిపోయిన మొద్దు శీను, పటోళ్ల గోవర్ధన్ రెడ్డి, కోడి కత్తి శీను, వివేకానంద రెడ్డి గారు లాంటి వారికి వారి కుటుంబాలకు నష్టం జరిగింది… భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారి మీద అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న నీలాంటి వాళ్లకు కచ్చితంగా నష్టం జరుగుతుంది.
చంద్రబాబు నాయుడుతో లాలూచీ పడి పనిచేస్తున్నది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అని… రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి సంబంధం లేదని ప్రజలకు తెలిసిపోయింది.
మీకు చేతనైతే దమ్ము ధైర్యం ఉంటే సుగాలి ప్రీతి కేసుని పరిష్కరించండి…. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని.. వారు ఎంతటి వారైనా సరేనని హెచ్చరించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/vlcsnap-2022-09-18-22h23m07s939.png)