Acer Indiaకు బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూ!

కరోనా లాక్ డౌన్ సమయంలో దేశంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో సోనూ సూద్ ప్రజల మనస్సులు గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా సోనూ సూద్‌కు బంపర్ ఆఫర్ వచ్చింది.  బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్ ఏసర్‌ ఇండియా అనే ప్రముఖ ల్యాప్‌టాప్‌ సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారని సంస్థ ప్రకటించింది. ఏసర్‌లో ఉన్న సాంకేతికతను వినియోగదారులకు వివరించడంలో సోనూ సూద్ కీలక పాత్ర పోషిస్తారని సంస్థ తెలిపింది.

మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా డిజిటల్‌ సాంకేతికతతో ఏసర్‌ ఇండియా అకట్టుకుంటుందని ఆ సంస్ధ ప్రతినిధులు పేర్కొన్నారు. తమ సంస్థకు సోనసూద్ వంటి మానవతావాది, రియల్ హీరో బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం సంతోషంగా ఉందని, కస్టమర్లకు సరికొత్త టెక్నాలజీని అందించేందుకు ఏసర్ ఇండియా కృషి చేస్తోందని ఎండీ హరీష్ కోహ్లి అన్నారు. ఏసర్‌ ఇండియా 1976లో స్థాపించబడగా ప్రస్తుతం160 దేశాలలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.