వారాహి యాత్ర విజయవంతం అవ్వాలని ప్రత్యేక పూజలు

ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం హెడ్ క్వార్టర్స్ లో రామతీర్థం జంక్షన్ వద్ద ఆంజనేయ స్వామి గర్బగుడిలో వేద మంత్రాలతో ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. జూన్ 14 వ తేదీన జరగబోవు వారాహి యాత్ర దిగ్విజయం గా విజయవంతం కావాలని అలాగే ప్రజలు సమస్యలపైన నిరంతరం పోరాడుతూ ప్రజానాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ 2024 లో ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ, పైడి భీమవరం జనసేన పార్టీ నాయకులు వడ్డాది శ్రీనివాస్, కృష్ణాపురం పంచాయతీ జనసేన పార్టీ నాయకులు పోట్నూరు లక్ష్మునాయుడు, జేఆర్ పురం పంచాయతీ జనసేన పార్టీ నాయకులు దాసరి బలరాం, దేరశాం గ్రామ జనసేన నాయకులు దన్నాన రవీంద్ర, ముల్లు శ్రీను, సత్తిబాబు, పి.రాజు, కృష్ణా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.