మదనపల్లిలో ప్రత్యేక పూజలు

సింగపూర్ లో పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం నుండి స్వల్ప అస్వస్థతతో బయటపడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పై దేవుని ఆశీస్సులు ఉండాలని మదనపల్లిలో కూటమి నాయకులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒక పక్క పెద్ద కొడుకు పుట్టినరోజు అయినా, చిన్న కుమారుడు ప్రమాదంలో ఉన్నా, విశాఖలో ప్రభుత్వ కార్యక్రమాలు ముగించుకొనే సింగపూరుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. కుటుంబం కంటే ప్రజలే ముఖ్యం అని ఏనాడో చెప్పారు. ఈరోజు అది మనం ప్రత్యక్షంగా చూశాం. ఇంత గొప్ప నాయకుడు దొరకడం మన రాష్ట్ర అదృష్టం అని ఈ సందర్భంగా దారం అనిత, నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాయలసీమ రీజనల్ కో-ఆర్డినేటర్ శ్రీమతి దారం అనిత, టిడిపి బిసి మాజీ జిల్లా కార్యదర్శి దుబ్బిగాల్ల భాస్కర్, మదనపల్లె జనసేన నాయకులు, అశ్వత్, పతి,అనిల్, శ్రీనాథ్, సిద్ధయ్య, సుధాకర్, నాగరాజు, ప్రసాద్, సుబ్బరాజు, పూజిత్, వీర మహిళలు మల్లికా, వాణి, టిడిపి నాయకులు చలపతి, రామూర్తి తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment