ఆవిర్భావ దినోత్సవ సభ విజయవంతం కావాలని మల్లన్నకు ప్రత్యేక పూజలు

శ్రీశైలం, ఈనెల 14వ తేదీ మచిలీపట్నంలో జరిగే జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సభ విజయవంతం కావాలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శ్రీశైలం సన్నిధిలో పూజలు నిర్వహించి భవిష్యత్తులో జనసేన పార్టీ విజయం సాధించి మా అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించాలని జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సభ కార్యనిర్వాహకులకు ప్రతిఒక్కరికీ ఆ మల్లన్న ఆశీసులు అందరికీ కలగాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అశోక్ జీవన్, శివకుమార్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.