Rajamahendravaram: కందుల దుర్గేష్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు

జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు..

జిల్లా జనసేన కార్యదర్శి షేక్ అమిన..!!

రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం కాంప్లెక్స్ దగ్గర ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో జనసేన తూర్పుగోదావరిజిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ కోవిడ్ బారిన పడిన కారణంగా త్వరగా కోలుకోవాలని తూర్పుగోదావరిజిల్లా జనసేన కార్యదర్శి శ్రీమతి షేక్ అమిన ఆధ్వర్యంలో స్వామి వారికి పూజలు అన్నసంతర్పణ నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా శ్రీమతి షేక్ అమిన మాట్లాడుతూ… తూర్పుగోదావరిజిల్లా అధ్యక్షులు మాకు దశ దిశ నిర్దేశకులు, మాకు రాజకీయ గురువులు కందుల దుర్గేష్ కరోన బారిన నుండి కోలుకోవాలని ఆరోగ్యంతో జనసేన కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలి కోరారు. ఈ కార్యక్రమంలో.. జిల్లా కార్యదర్శి బీర ప్రకాష్, శివ రెడ్డి, దూద్ సాయి బాలు మహీంద్రా, ప్రసాద్, లోకేష్, లక్ష్మి, రాజేశ్వరి, పుష్ప, సత్య కళ, లక్ష్మీ ప్రసన్న, ఆదిలక్ష్మి, భారతి, నాని, జనసైనికులు, నాయకులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.