శ్రీ మధ్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో యువశక్తి ప్రచార రథానికి ప్రత్యేకపూజలు

తాడిపత్రి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు మద్దతుగా ఈ నెల 12.01.23 శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి పేరుతో భారీ భహిరంగ సభను ఏర్పాటు చేస్తున్న కారణంగా జనసేన పార్టీ నాయకులు మై ఫోర్స్ మహేష్ అన్న రాయలసీమ యువశక్తి ప్రచార రథానికి శ్రీ మధ్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. రాష్ట్రంలో యువత ఉద్యోగ అవకాశాలు లేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను వంచిస్తోందని, చదివిన చదువులకు సరైన ఉద్యోగాలు లేక తీవ్ర ఆవేదన చెందుతున్నారు. యువత కష్టాలను ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కి తెలిసేలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతీ యువకులు ఈ సభలో మీ అభిప్రాయాలను ప్రస్తావించి ఈ యువశక్తి భారీ సభను విజయవంతం చెయ్యాలని స్టేట్ ఫైనాన్స్ కమిటీ సభ్యులు మహేష్ కోరారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ అధ్యక్షులు అమర్ నారాయణ, బాల సముద్రం ఎంపీటీసీ అమర్, కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల, కదిరి ఐటి వింగ్ కోఆర్డినేటర్ పోరకాల రాజేంద్ర ప్రసాద్, కదిరి పట్టణ అధ్యక్షులు కాయల చలపతి, వీర మహిళల శోభ, అంజిబాబు, కిన్నెర మహేష్, అనిల్, మున్న, శ్రీధర్, బాల కృష్ణ, ఖాలేశా, కిషోర్, నాగరాజు, హరి బాబు, అన్నం జయ వర్ధన్, చిన్నా రెడ్డి, చక్రి, సురేష్, ఆకుల హరి ప్రసాద్, కదిరి నియోజక వర్గం జనసైనికులు పాల్గొన్నారు.