జనసేన ఆవిర్భావ సభ విజయవంతంపై మాకినీడి ప్రత్యేక కృతజ్ఞతలు

కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి బుధవారం జనసేన ఆవిర్భావ సభ విజయవంతమైనందుకు పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు, జనసైనికులకు, వీరమహిళలకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన ఛలో మచిలీపట్నంలో జరిగిన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు, జనసైనికులకు, వీరమహిళలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. పవన్ ఆశయాలకు, సిద్ధాంతాలకు, అనుగుణంగా ప్రతి ఒక్క జనసైనికుడు కృషి చేయాలని కోరారు.