కశింకోట జనసైనికుల ఆత్మీయ సమావేశం
అనకాపల్లి నియోజకవర్గం, కశింకోట మండలం, కొత్తపల్లి బుచ్చియ్యపేట గ్రామంలో ఆదివారం జనసైనికుల ఆత్మీయ సమావేశం కాసిందేవు వెంకట అప్పారావు (అఖిల్ శ్రీను) ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జనసేనాని ఉత్తరాంద్ర పర్యటనలో భాగంగా విశాఖ సంఘటన నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం వేగంగా రాజకీయ సమీకరణాలపై విశ్లేషిస్తూ రానున్న కాలంలో అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా 2024లో రెపరెపలాడేందుకు జనసైనికులుగా అందరూ సమిష్టిగా కృషి చేసి, అనకాపల్లి నియోజకవర్గం జనసేన పార్టీకి బహుమతిగా ఇచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని కోరుతూ, వచ్చే నెలలో కశింకోట మండలంలో జరిగే జనసేన పార్టీ బహిరంగ సభ విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి అనకాపల్లి నియోజకవర్గ నాయకులు మంగా ఈశ్వర్ వివరించారు. ఈ కార్యక్రమంలో కశింకోట మండల నాయకులు గొంతిన ఈశ్వరరావు, కడిమి నాగ చిరంజీవి, గూడెపు మణికంఠ, కలిగెట్ల వీర, కాయల బాబురావు, అనకాపల్లి పట్టణ నాయకులు మద్దాల రాంజీ, వై సాయి ధర్మ, గొన్నా చంటి, పడాల యస్వంత్, మరియు కొత్తపల్లి బుచ్చియ్యపేట గ్రామ జనసైనికులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-30-at-22.23.20-1024x492.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-30-at-21.42.49-1024x768.jpeg)