బర్మా ఫణి బాబు ఆధ్వర్యంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశం

నూజివీడు నియోజకవర్గం: జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బర్మా ఫణి బాబు ఆధ్వర్యంలో శుక్రవారం వందలాది మందితో కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఆత్మీయ సమావేశానికి నూజివీడు, చాట్రాయి, ఆగిరిపల్లి, ముసునూరు మండల పార్టీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా బర్మా ఫణి బాబు మాట్లాడుతూ జనసేన పార్టీ నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్తగా అందరినీ కలుపుకుపోతూ పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు. నూజివీడు నియోజకవర్గంలో జనసేన, టీడీపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి విజయం కోసం పని చేస్తామన్న బర్మా ఫణి బాబు. రానున్న రోజుల్లో వైసిపి అరాచక పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చిన బర్మా ఫణి బాబు. జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా అందరిని కలుపుకుపోతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం పనిచేస్తానన్న బర్మా ఫణి బాబు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ నాదెండ్ల మనోహర్, కృష్ణాజిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ లకు కృతజ్ఞతలు తెలిపిన బర్మా ఫణి బాబు. బర్మా ఫణి బాబు సారధ్యంలో కలిసికట్టుగా పనిచేస్తూ పార్టీని అభివృద్ధి బాటలో తీసుకువెళ్తామన్న నాయకులు, కార్యకర్తలు.