అమలాపురంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి, శెట్టిబలిజల ఆత్మీయ సమావేశం

కోనసీమ జిల్లా: అల్లవరం మండలం, బోడసకుర్రు బిఆర్ కె ఫంక్షన్ హాల్ జరిగిన సమావేశంలో శెట్టిబలిజలు టిడిపి కూటమికి మద్దతుగా ఓటు వేయాలని కోరిన రామచంద్రపురం అసెంబ్లీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ అన్నారు. శెట్టిబలిజల ఆత్మీయ సమావేశంలో రామచంద్రపురం కూటమి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ అమలాపురం ఎన్డీఏ కూటమి అసెంబ్లీ అభ్యర్థి అయితా బత్తుల ఆనందరావు మరియు అమలాపురం పార్లమెంట్ కూటమి అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ లకు, పెచ్చేట్టి చంద్రమౌళి, పెచ్చేట్టి విజయలక్ష్మి శెట్టి బలిజల మద్దతు తెలియజెసారు. ఈ ఐదు సంవత్సరాలు బీసీ కార్పొరేషన్ నుంచి ఒక్క ఋణం కూడా మంజూరు చేయలేదు. కులాల మధ్య చిచ్చు పెట్టడమే ఈ వైసీపీ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయం. ప్రతి బూత్ లో ఓటు బదిలి జరగాలి. ప్రతి బూత్ లో ఉమ్మడి అభ్యర్థులకు మెజార్టీ రావాలి. కొంతమంది శెట్టిబలిజ నాయకులు మనతో ఆడుకుంటున్నారు. అన్నారని శెట్టిబలిజ నేత, రామచంద్రపురం టిడిపి ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్.. సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్, అమలాపురం అసెంబ్లీ అభ్యర్థి ఆనందరావు, తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.