ఆధ్యాత్మికతతోనే భక్తి భావం – డాక్టర్ కందుల నాగరాజు

విశాఖ, ఆధ్యాత్మిక భావనతోనే భక్తి భావం పెంపొందుతుందని దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్, వాసవి ఇంటర్నేషనల్ వి.201 ఏ గవర్నర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. శంకరమఠంలో వాసవి క్లబ్ వనిత కె.సి.జి.ఎఫ్. వైజాగ్ ఫేమీనా ఆధ్వర్యంలో నిర్వహించిన దీపలక్ష్మి పూజ మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుల నాగరాజు మాట్లాడుతూ శంకరమఠంలో వాసవి క్లబ్ వనిత కె.సి.జి.ఎఫ్. వైజాగ్ ఫేమీనా ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వైభవోపేతంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తాను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. దీపలక్ష్మి పూజా మహోత్సవంలో 600 మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరిలో భక్తి భావం మరింతగా పరిడవిళ్లేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ వనిత కె.సి.జి.ఎఫ్. వైజాగ్ ఫేమీనా ప్రతినిధులు బి.సావిత్రి, బి.పద్మావతి, సత్యలక్ష్మి, సాయి నిర్మల, చక్క చందన, సాహిత్య, క్లబ్ ప్రెసిడెంట్ సుభద్ర, సెక్రటరీ గాయత్రి, ట్రెజరర్ సూర్యకుమారి ఇతర సభ్యులు పాల్గొన్నారు.