శ్రీ పోలేరమ్మ తల్లి తిరుణాలలో పాల్గొన్న జనసేన నాయకులు

చిలకలూరిపేట నియోజకవర్గం, గణపవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి తిరుణాల సందర్భంగా గణపవరం గ్రామ జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన జనసేన పార్టీ లైటింగ్ ప్రభలు సందర్శించిన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, బిట్రగుంట మల్లికా, గుంటూరు జిల్లా కార్యదర్శి తోట రాజ రమేష్, సంయుక్త కార్యదర్శి షేక్ సుభాని, రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, జిల్లా అధికార ప్రతినిధి అళ్ళ హరి మరియు చిలకలూరిపేట నియోజకవర్గ మండల అధ్యక్షులు, చిలకలూరిపేట నియోజకవర్గ నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు.