పవన్ కళ్యాణ్ నాయకత్వంలోనే శ్రీ రామ రాజ్యం

పాలకొండ నియోజకవర్గం: వీరఘట్టం మండలం, బొడ్లపాడు గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీల సభ్యులు జనసేన జానీ జనసేన జెండా చేతపట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమల బయల్దేరి వెళ్లారు. జనసేన అధికారంలో రావడమే లక్ష్యంగా అయ్యప్ప దీక్ష చేపట్టినట్టు ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో శ్రీ రామ రాజ్యం రావాలి అంటే పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలోనే అది సాధ్యపడుతుంది అని ఈ సందర్బంగా జనసేన జానీ వివరించారు. ఈ కార్యక్రమంలో వీరఘట్టం మండలంకి చెందిన క్రియాశీలక వాలంటీర్ మత్స పుందరికంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణాకి చెందిన జనసైనికులు పాల్గొన్నారు.