అయ్యప్ప స్వామి పూజలో పాల్గొన్న శ్రీరామ రామాంజనేయులు

మదనపల్లె నియోజకవర్గం: మదనపల్లె రూరల్ మండలంలోని గురువారం కొత్త పల్లె గ్రామంలో హరిహర సుతుడు అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమం ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కొత్త పల్లె గ్రామస్తులు మరియు మాలధారణ స్వాములు కోరిక మేరకు మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు కుటుంబ సమేతంగా హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొని పూజ కార్యక్రమాలు అనంతరం స్వాములకు స్వయంగా రామాంజనేయులు సతీ సమేతంగా కుమారుడు హరిహరన్, కోడలు దీపికా, కుమార్తె శిల్పసౌజన్య, అల్లుడు హరీష్ తో కలిసి స్వాములకు అన్నవితరణ భిక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్ స్టూడెంట్ వింగ్ అధ్యక్షులు సుప్రీం హర్ష, ఉపాధ్యక్షుడు జనసేన సోను, ఘని, పురుషోత్తం స్వామి మరియు కొత్త పల్లె గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.