తర్లుపాడు మండల జనసేన ఆధ్వర్యంలో శ్రీరామనవమి

ప్రకాశం జిల్లా, మార్కాపురం నియోజకవర్గం తర్లుపాడు మండలం శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని శ్రీ కోదంరామస్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా తర్లుపాడు గ్రామంలో జనసేనపార్టీ తర్లుపాడు మండల ఉప అధ్యక్షురాలు సూరే సువర్ణ ఆధ్వర్యంలో వారి స్వగృహం వద్ద తెలుగుదనం ఉట్టిపడేలాగా జనసేన వీర మహిళలతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాధ్ అనంతరం తర్లుపాడు గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన ఇమ్మడి కాశీనాధ్. ఈ సంద్భంగా తర్లుపాడు మండల ఉప అధ్యక్షురాలు సూరే సువర్ణ మరియు జనసేన వీర మహిళలు మాట్లాడుతూ.. జనసేన పార్టీ మండల, గ్రామ కమిటీలలో మగ వారితో పాటు అత్యధికంగా మహిళలకు కమిటీలలో పెద్దపీట వేస్తూ ప్రోత్సహిస్తున్న జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాధ్ కి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, తర్లుపాడు మండల అధ్యక్షుడు చేతుల శ్రీనివాసులు, ఉప అధ్యక్షురాలు సూరే సువర్ణ, జనసేన నాయకులు గుంటూ రత్నకుమార్, శిరిగిరీ శ్రీనివాసులు, జానకి రామ్ సింగ్, పుల్లయ్య మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.