ఎగువకుమ్మరపల్లెలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో నందలూరు మండలం, ఎగువకుమ్మరపల్లెలోని శ్రీ సీతారామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగవైభవంగా నిర్వహించబడింది. ప్రతి ఏడాది రామనవమి రోజున జరిపే ఈ మహోత్సవాన్ని, ఈ సంవత్సరం ఏప్రిల్ 6 (ఆదివారం) నాడు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఉదయం అభిషేకం, తదుపరి కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో సాగాయి. ఈ కార్యక్రమానికి స్థానికులు మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భక్తులకు అన్నప్రసాదాన్ని స్వయంగా యల్లటూరు శ్రీనివాస రాజు ఏర్పాటు చేసి, పునీతమైన సేవగా నిలిచారు. భక్తులు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Share this content:

Post Comment