నంది వాహ‌నంపై శ్రీ సోమస్కందమూర్తి కటాక్షం

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి శ్రీ సోమస్కంధమూర్తి నంది వాహ‌నంపై కటాక్షించారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. కైలాసంలో మెడలో మువ్వలదండలతో, కాళ్లకు గజ్జెలతో మనోహరాకారంతో, బంగారుకొమ్ములతో అలరారే నంది భవుడికి నిత్యవాహనం. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ దేవేంద్ర బాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ చంద్ర‌శేఖ‌ర్‌, ఆల‌య అర్చ‌కులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-02-27-at-3.23.16-PM-1024x683 నంది వాహ‌నంపై శ్రీ సోమస్కందమూర్తి కటాక్షం

Share this content:

Post Comment