అంగరంగ వైభవంగా శ్రీశ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి 8 వ వార్షికోత్సవ సంబరాలు

రాజానగరం, చక్రద్వారబంధం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీశ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి 8 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన భారీ అన్నసమారాధన కార్యక్రమానకి జనసైనికులు ఆహ్వానం మేరకు విచ్చేసిన జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అనంతరం ఆలయ కమిటీ వారికి ₹5000/- విరాళం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరితో పాటు భూషంశెట్టి అర్జున్, పేపకాయల నాగేశ్వరావు, కడియం దుర్గారావు, శెట్టి శ్రీను, పేపకాయల మణికంఠ, భూషంశెట్టి దుర్గారావు, సోడసాని రాంకుమార్, చిక్కిరెడ్డి పవన్ కుమార్, దాకవరపు వెంకన్నబాబు, ప్రగడ కోదండ, కిమిడి శ్రీరామ్, దేవన దుర్గాప్రసాద్, వేగిశెట్టి రాజు మరియు ఇతర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.