శ్రీ తాడేలమ్మ తల్లి మెగా క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రదానం చేసిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం: జనసేన పార్టీ నాయకులు బత్తుల బలరామకృష్ణ రాజానగరం మండలం పాలచర్ల గ్రామంలో జరుగుతున్న శ్రీ తాడెలమ్మ తల్లి మెగా క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఫైనల్స్ పోటీలను వీక్షించారు.. ఈ పోటీలలో ఫైనల్స్ కు “తోకాడ గ్రామం – నిడిగట్ల గ్రామం” చేరుకున్నాయి.. ఈ రెండు టీం లు ఫైనల్స్ లో చక్కటి ప్రదర్శన కనబరిచాయి.. ఉత్కంట భరితంగా సాగిన ఈ పోటీలలో తోకాడ గ్రామం విజేతగా నిలిచింది. ఈ పోటీలలో విజేతగా గెలుపొందిన తోకాడ గ్రామానికి రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ సహకారంతో 50,000 రూపాయలు ప్రైజ్ మనీతో పాటు షీల్డ్ బహుకరించారు. రన్నర్ అప్ గా నిలిచిన నిడిగట్ల గ్రామానికి 25,000 రూపాయలు అందజేశారు. అనంతరం ఈ పోటీలలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ మెడల్స్ తో సత్కరించి వారిలో మరింత క్రీడాస్ఫూర్తిని నింపారు. అనంతరం బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొదించడానికి ఇలాంటి పోటీలు దోహదపడతాయని.. యువకులు మరింత ఉత్సాహంతో ఇలాంటి క్రీడాల్లో పాల్గొనాలని..పోటీల్లో పాల్గొన్న ప్రతీ టీం మెంబెర్ కు అభినందనలు తెలిపి ఈ పోటీలలో ఉత్తమమైన ప్రదర్శన కనబరిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీ మేడిశెట్టి శివరామ్, శ్రీకృష్ణపట్నం సర్పంచ్ కిమిడి శ్రీరామ్, మదిరెడ్డి బాబులు, గంగిశెట్టి రాజేంద్ర, మాజీ ఎం.ఆర్.పి.ఎస్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రఘు, మదిరెడ్డి బాబులు, కమిడి సత్తిబాబు, బోయిడి వెంకట్, కొత్తపల్లి బుజ్జి, కవల శ్రీరామ్, వేగిశెట్టి రాజు మరియు గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.