శ్రీదేవి or సౌందర్య బయోపిక్.. నేను రెడీ అంటున్న రష్మిక

కన్నడ క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న తెలుగులో దూసుకెళ్తుంది. ఛలో అంటూ వచ్చి సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమాతో సత్తా చాటింది అమ్మడు. వరుస సినిమాలు వాటిని హిట్లు కొడుతూ తెలుగు టాప్ హీరోయిన్ రేసులో మొదటి మూడు స్థానాల్లో ఉంది రష్మిక. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాల్లో నటిస్తున్న రష్మిక మందన్న ఎన్.టి.ఆర్, త్రివిక్రం సినిమాల్లో ఛాన్స్ కూడా అందుకుందని తెలుస్తుంది.

ఇక ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో బయోపిక్ ల మీద తన కామెంట్ ఏంటో చెప్పింది రష్మిక. తనకు బయోపిక్ సినిమాల్లో నటించడం ఇష్టమని. శ్రీదేవి బయోపిక్ చేయాలని ఉందని.. ఎవరైనా వచ్చి శ్రీదేవి బయోపిక్ చేయమని అడిగితే తప్పకుండా చేస్తానని చెప్పింది. అయితే శ్రీదేవి బయోపిక్ ఛాన్స్ రాకపోతే మాత్రం సౌందర్య జీవిత కథలో అయినా నటిస్తానని అంటుంది రష్మిక. మొత్తానికి రష్మిక ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ బయోపిక్ సినిమాల మీద ఆసక్తి చూపుతుందని తెలుస్తుంది.