గణిత శాంతమ్మ కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన శ్రీధర్ పిల్లా

పిఠాపురం, నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా ఉప్పాడ గ్రామంలోని రామిశెట్టి పేట నందు గణిత శాంతమ్మ అకాల మరణానికి చింతిస్తూ డాక్టర్ శ్రీధర్ వారి యొక్క కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. వారికి అన్నివిధాలుగా తోడుగా ఉంటాం అనే భరోసాని ఇవ్వడమేకాక వారి యొక్క కుటుంబ అవసరాల నిమిత్తం 50 కేజీల బియ్యం మరియు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రవి, రాజు, జాన్సన్, నాని, జాన్ మరియు తదితర జనసైనికులు పాల్గొన్నారు.